News February 8, 2025
బాలుడి మర్మాంగాన్ని కొరికిన కుక్క..!

ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుంట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు లక్ష్మయ్య ఇంట్లో నిద్రిస్తుండగా వారు పెంచుకునే కుక్క మర్మాంగాన్ని కొరికింది. కుటుంబీకులు బాలుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాలుడి మర్మాంగానికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు.
Similar News
News February 7, 2026
ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో రాణించగలరు: ఎస్పీ

పోలీసులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన వీక్లీ పరేడ్లో మాట్లాడారు. సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్తోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
News February 7, 2026
నిర్మల్: సీనియర్ లీడర్స్ ఫుల్ యాక్షన్ మోడ్!

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులు ప్రచార వేగాన్ని పెంచారు. వార్డు స్థాయిలో సమావేశాలు, కార్యకర్తలతో సమన్వయం, ఇంటింటి ప్రచారం ద్వారా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. పార్టీ వర్గాలు ఈ ప్రచారం ఫలితాలపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే స్థానిక సమస్యలు, ప్రత్యర్థుల వ్యూహాలు కూడా ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
News February 7, 2026
కొత్తకోట బరిలో భార్యాభర్తలు

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ 10వ వార్డు నుంచి అడ్వకేట్ యాదగిరి పోటీ పడుతుండగా, 11వ వార్డు నుంచి ఆయన భార్య శ్రీలత బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. మున్సిపల్ చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పదవిని దక్కించుకోవాలని శ్రీలత ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్లో ఈ దంపతుల రాజకీయ భవిష్యత్తు తేలనుంది.


