News September 10, 2025
బాసర: విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి

బాసర ట్రిపుల్ఐటీలో రూ.1.5 కోట్ల నిధులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. విద్యార్థులను పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో తమకు సరైన లాప్టాప్లు లేవన్నారు. క్రీడాల కోసం హాకీ, క్రికెట్ గ్రౌండ్లో నీరు నిండుతున్నాయన్నారు. మంత్రి స్పందించి NREGS నిధులతో మరమ్మతులు చేయించాలని వీసీ గోవర్ధన్ను ఆదేశించారు.
Similar News
News December 17, 2025
రూ.లక్షకు రూ.73లక్షల వడ్డీ.. కిడ్నీ అమ్ముకున్న రైతు

వ్యవసాయంలో నష్టాలతో పాల వ్యాపారం చేద్దామనుకున్న రైతు కిడ్నీ అమ్ముకున్న విషాద ఘటన MHలో జరిగింది. చందాపూర్(D)కు చెందిన కుడే అనే రైతు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. లాభాలు రాకముందే ఆవులు చనిపోయాయి. రోజుకు రూ.10వేల వడ్డీ వేయడంతో అప్పు రూ.74లక్షలకు చేరింది. పొలం, ట్రాక్టర్ అమ్మినా అప్పు తీరలేదు. దీంతో వ్యాపారుల సలహాతో కుడే కంబోడియా వెళ్లి రూ.8లక్షలకు కిడ్నీ అమ్మి వారికి చెల్లించాడు.
News December 17, 2025
నంద్యాల: ఈనెల 23న జాబ్ మేళా

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం అని టీడీపీ నాయకుడు ఎన్ఎండీ ఫయాజ్ అన్నారు. నంద్యాలలో ఈ నెల 2న స్థానిక నేషనల్ డిగ్రీ కాలేజీలో ఉదయం 9 గంటలకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుపేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్ను జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి విడుదల చేశారు.
News December 17, 2025
ధనుర్మాసం: ఏయే పూజలకు ఏయే ఫలితాలు?

ధనుర్మాసంలో వైష్ణవాలయాన్ని దర్శించాలని పండితులు సూచిస్తున్నారు. గంధాన్ని భక్తులకు పంచితే మంచి జరుగుతుందని అంటున్నారు. అగ్నిపురాణం ప్రకారం.. ఆలయానికి శక్తి కొలది దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. సంపంగి పూలతో విష్ణును పూజిస్తే కుజదోషం పోతుంది. ఏజ్ పెరిగినా.. పెళ్లికాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. తెల్లగన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే ఆర్థిక సమస్యలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.


