News February 1, 2025
బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. బీఆర్ఎస్ నుంచి ఎవరో..?

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టబద్రుల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డిని నిన్న ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ, కేసీఆర్ సొంత ఇలాకాలో బీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
Similar News
News February 6, 2025
మెదక్: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

ఉత్తరప్రదేశ్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.
News February 6, 2025
మెదక్: అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని తగులబెట్టారు. తల సగం కాలింది. ఆస్థి పంజరం మహిళదా? పురుషుడిదా? అనేది తేలాల్సి ఉంది. ఘటనా స్థలానికి హవేలి ఘనపూర్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభ్యం కావడంతో పరిసర గ్రామాల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా అని ఆరా తీస్తున్నారు.
News February 6, 2025
తూప్రాన్లో వ్యక్తి కుళ్లిన శవం లభ్యం

తూప్రాన్ పట్టణంలో ఓ ఇంట్లో వ్యక్తి కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వడియారం మల్లేశం(48) భార్యా పిల్లలతో గొడవ కారణంగా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లేశం ఇంట్లో 10 రోజుల క్రితం చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో ఈరోజు తలుపులు తొలగించి చూడగా మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.