News March 31, 2024
బెల్లంపల్లి: 14 మంది విద్యార్థులకు ప్రీమియర్ COEలో సీట్లు

బెల్లంపల్లి COE విద్యార్థులు 14 మంది ప్రతిష్ఠాత్మకమైన COEలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. ప్రీమియర్(స్టేట్) COEలైన గౌలిదొడ్డి, చిలుకూరు, షేక్పేట్, అల్గనూర్, ఇబ్రహీం పట్నం COEల్లో 14మంది విద్యార్థులు సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మిగిలిన COEల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు.
Similar News
News February 7, 2026
మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
News February 7, 2026
అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. 2026–28 సంవత్సరాలకు గాను అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయని తెలిపారు. మీడియా యజమాన్యాలు తమ ప్రతినిధుల పేర్లను డీపీఆర్ఓకు పంపించాలన్నారు. https://ipr.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 9 నుంచి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
News February 7, 2026
ఆదిలాబాద్: సమయం లేదు మిత్రమా..!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా విశ్వ ప్రయత్నాలతో ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కాగా ప్రచారానికి సమయం నేటితో కలిపి మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి.


