News August 22, 2024
బోధన్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి చెందిన ఘటన బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయికుమార్ (22) ఐదు రోజుల క్రితం రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి గోదావరిలో ఈతకు వెళ్లి మృతి చెందడు. అయితే కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి దేవర్ల వెంకటేశ్(54) గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News January 17, 2026
NZB: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవే

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల మేయర్, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. NZbమేయర్ పదవిని జనరల్ (మహిళ)కు, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ అన్ రిజర్డ్వ్డ్కు రిజర్వ్ చేయగా ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఛైర్మన్ పదవులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.
News January 17, 2026
NZB: వరుసగా మూడోసారి మేయర్ పదవి మహిళ (జనరల్)కే

త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పదవి మహిళ (జనరల్)కు రిజర్వ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. గత రెండు పర్యాయాలు మహిళ (జనరల్)కు రిజర్వ్ అవగా BRS నుంచి ఆకుల సుజాత, దండు నీతూ కిరణ్ మేయర్ పదవిని చేపట్టారు. ఈ పర్యాయం BJP, కాంగ్రెస్, BRS, MIM పార్టీలు మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
News January 17, 2026
NZB: 60 డివిజన్లు కాంగ్రెస్, బీజేపీ నుంచి 500 మంది ఆశావహులు

NZB కార్పొరేషన్లో పోటీకి వందలాది ఆశావహులు రెడీ అయ్యారు. 60 డివిజన్లలో కేవలం రెండు ప్రధాన పార్టీల్లోనే 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి 300 మంది బీజేపీ నుంచి 200 మంది టికెట్లకు అప్లై చేశారు. ఎవరి రూట్లో వారు టికెట్ల లాబీయింగ్ చేసుకుంటున్నారు. బీజేపీ ఇప్పటికే 14 మందికి మీకే టికెట్ అని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రిజర్వేషన్లు రాగానే వారి పేర్లు ప్రకటించే ప్లాన్ చేసింది బీజేపీ.


