News August 9, 2024
భద్రత ఉపసంహరణపై హైకోర్టులో బాలినేని పిటిషన్

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనకు గతంలో 2+2 భద్రతను పునరుద్ధరించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం జడ్జి వరాహ లక్ష్మీనరసింహచక్రవర్తి విచారణ చేశారు. ఏకపక్షంగా భద్రతను ఉపసంహరించారని బాలినేని తరఫు న్యాయవాది వివేకానంద పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. SRC నివేదిక మేరకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించుకుందన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి చెప్పారు
Similar News
News December 14, 2025
ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
News December 14, 2025
ప్రకాశంలో నవోదయకు పరీక్షకు 1998 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లాలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 1998 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఒంగోలు నవోదయ ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. ఒంగోలులోని నవోదయ విద్యాలయ వద్ద ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఆరో తరగతి ప్రవేశపరీక్ష పకడ్బందీగా నిర్వహించామన్నారు. మొత్తం 5,502 మంది విద్యార్థులకు గాను, 3,504మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు.
News December 13, 2025
ఈ ఒంగోలు అమ్మాయి చాలా గ్రేట్..!

ఒంగోలుకు చెందిన PVR గర్ల్స్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఆముక్త తన ప్రతిభతో సత్తాచాటింది. జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తన తొలి ఓపెన్ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ నార్మ్ సాధించింది. 13 ఏళ్ల వయసులోనే మహిళ పైడే మాస్టర్ టైటిల్ పొందిన ఆముక్తను కలెక్టర్ రాజాబాబు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.


