News September 10, 2025
భద్రాచలం ఆలయ హుండీ లెక్కింపు

భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తుల సమక్షంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీని లెక్కిస్తున్నారు. లెక్కింపు అనంతరం ఆదాయ వివరాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News December 16, 2025
WGL: స్వస్తిక్ ముద్ర బాక్స్ దాటితే చెల్లదంతే..!

జిల్లాలో మూడో విడత ఎన్నికలు బుధవారం జరగనుంది. స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్ను వినియోగిస్తున్నారు. గులాబీ రంగు, తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లో పేర్లు లేకుండా గుర్తులు మాత్రమే ఉంటాయి. గుర్తుల పక్కన ఉన్న బాక్స్లో ఓటరు స్వస్తిక్ ముద్రను వేయాలి. ఓటర్లు ఓటు అలా వేయకుండా గడి దాటి ముద్రవేస్తే గడి సరిహద్దులపై పడితే చెల్లదు. ఎమరుపాటు ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News December 16, 2025
SVU పీజీ ఫలితాలు విడుదల.!

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది జనవరిలో పీజీ (PG) M.A రూరల్ డెవలప్మెంట్/ హిందీ/ ఎకనామిక్స్ టూరిజం/ తెలుగు, ఎంఎస్సీ ఆక్వా కల్చర్, M.Com(R) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.results.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్.!

➤ టెక్కలి ఇండోర్ స్టేడియంకు మహర్దశ: అచ్చెన్నాయుడు
➤ శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మందికి పోలియో చుక్కలు
➤ మత్తు పదార్దాలు అరికట్టాలి: డీఐజీ
➤ నరసన్నపేట: అక్రమ కట్టడాలపై వాడీ వేడి చర్చ
➤ బ్రాహ్మణతర్లలో ఆఖరి మజిలీకి అష్టకష్టాలు
➤ శ్రీకాకుళం రిమ్స్లో అన్యమత ప్రచారంపై నిరసన
➤ భార్య హత్య కేసు.. భర్తకు జీవిత ఖైదు.


