News November 5, 2025
భద్రాచలం గోదావరి వద్ద కార్తీక శోభ

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నది తీరంలో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను నదిలో వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో దేవాలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
Similar News
News January 23, 2026
టుడే టాప్ స్టోరీస్

* ముగిసిన AP, TG సీఎంలు చంద్రబాబు, రేవంత్ దావోస్ పర్యటన
* ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRకు నోటీసులు.. రేపు విచారణ
* రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: YS జగన్
* తిరిగి రాజకీయాల్లోకి వస్తా: విజయసాయి రెడ్డి
* బ్యాడ్మింటన్లో 500 విజయాలు సాధించిన భారత ప్లేయర్గా పీవీ సింధు రికార్డ్
* భారత్లో T20WC ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్
* లాభాల్లో మార్కెట్లు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
News January 23, 2026
టెక్ మహీంద్రా విస్తరణను వేగవంతం చేయండి: లోకేశ్

AP: టెక్ మహీంద్రా CEO&MD మోహిత్ జోషీతో మంత్రి లోకేశ్ దావోస్లో భేటీ అయ్యారు. VJAలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. AI & ML, క్లౌడ్ IOT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ&సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతోనూ లోకేశ్ చర్చించారు.
News January 23, 2026
WPL: యూపీపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్స్పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.


