News August 20, 2025

భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదారమ్మ

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. సోమవారం 38 అడుగులు దాటిన నీటిమట్టం మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 36.80 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెరిగిన నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. దాంతో ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

Similar News

News January 22, 2026

అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

image

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

News January 22, 2026

చక్రాయపాలెంలో ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు

image

అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి అద్దంకి సాధించగా, రెండో బహుమతి చక్రాయపాలెం అందుకుంది. మూడో స్థానంలో కొమ్మినేని వారిపాలెం నిలవగా విజేతలకు సీఐ సుబ్బరాజు హాజరై బహుమతులు ప్రదానం చేశారు.

News January 22, 2026

మదనపల్లి బస్టాండులో పెద్దమండెం వ్యక్తి మృతి..!

image

మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించింది. 2-టౌన్ SI రహీముల్లా, ఏఎస్ఐ రమణలు సీఐ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దమండెం మండలం వెలిగల్లు కాలానీకి చెందిన శంకరప్ప కొడుకు<<18916147>> మారుతీగా గుర్తించారు.<<>> మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఏఎస్ఐ రమణ తెలిపారు.