News March 10, 2025

భద్రాద్రికొత్తగూడెం: రైల్వే బోర్డు ఛైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ

image

జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఆయన రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్త ప్లాట్‌ఫామ్‌లను విస్తరించడం, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్‌లు కొత్త రైళ్ల మంజూరుపై మాట్లాడారు. 

Similar News

News January 14, 2026

చిత్తూరుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

తవణంపల్లి: తెల్లగుండ్లపల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణం వందలూరు గ్రామానికి చెందిన కే. బుజ్జమ్మ (45) భర్త మురుగయ్య‌తో కలిసి బైకుపై చిత్తూరుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మురుగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మురుగయ్యను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.

News January 14, 2026

తాండూర్: స్కూల్‌కు వెళ్లమన్నందుకు సూసైడ్

image

తాండూర్ మండలం నీలాయపల్లిలోని వడ్డెర కాలనీ చెందిన రుద్ర హనీతేజ (15) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు మాదారం ఎస్ఐ సౌజన్య తెలిపారు. హనీ తేజ తంగళ్లపల్లి ZPSSలో టెన్త్ చదువుతున్నాడు. డిసెంబర్ 21న స్కూలుకు వెళ్లమని తల్లి మందలించగా ఇంట్లో గడ్డి మందు తాగాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News January 14, 2026

కామారెడ్డి: పండుగ పూట విషాదం

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు స్థానిక ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. కొంపల్లి సాయిలు గ్రామ శివారులోని లింగోష్ పల్లి చెరువు వద్ద చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు మృతుని కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడని ఎస్ఐ చెప్పారు.