News February 9, 2025

భద్రాద్రిలో దారుణం.. గర్భిణి ఆత్మహత్యాయత్నం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని రామాంజిగూడెంకు చెందిన మౌనిక అనే గర్భిణి కుటుంబ కలహాలతో శనివారం పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త మధు హుటాహుటిన ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వివరించారు.

Similar News

News February 13, 2026

10వేల కండోమ్స్ 3 రోజుల్లో ఖతం

image

శీతాకాల ఒలింపిక్స్-2026లో కండోమ్స్ కొరత ఏర్పడింది. 2900 మంది అథ్లెట్స్ కోసం 10వేల ప్యాకెట్లను సిద్ధం చేయగా 3 రోజుల్లోనే షెల్ఫులు ఖాళీ అయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో, విమర్శలు రాకుండా వెంటనే స్టాక్ తెప్పిస్తున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా ఒలింపిక్స్‌లో చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు. కరోనా సమయంలో మాత్రం వీటికి బ్రేక్ పడింది.

News February 13, 2026

ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

<>ఇందిరాగాంధీ<<>> నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి PhD, M.Phil/NET/JRF, ఎంఏ, ఎంఎస్సీ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal.igntu.ac.in

News February 13, 2026

మేడ్చల్‌లో పట్టు నిలుపుకున్న మల్లారెడ్డి

image

మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ MLA మల్లారెడ్డి పట్టు నిలుపుకున్నారు. BJP గెలుపు కోసం MP ఈటల రాజేందర్, కాంగ్రెస్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేటలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో పురపోరు మరింత రసవత్తరంగా మారింది. నేటి ఫలితాల్లో TGలో మెజార్టీ కాంగ్రెస్ గాలి వీచినా.. మేడ్చల్‌లో జనం కారుకే మొగ్గు చూపారు. 33 వార్డుల్లో మల్లన్న చరిష్మా స్పష్టంగా కనిపించింది.