News August 14, 2025
భద్రాద్రి: ఆగస్టు 15 ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో జరిగే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి తుమ్మల వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Similar News
News March 10, 2026
BREAKING: 13న అకౌంట్లలో డబ్బులు జమ

రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేస్తారు. కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.
News March 10, 2026
ప్రజలపై భారం.. మీ విద్యుత్ కొనం: NTPCకి రాష్ట్రం లేఖ

TG: బయట చౌకగా దొరుకుతున్నా ఒప్పందం పేరిట ఎక్కువ ధర ఉన్న NTPC విద్యుత్తును కొనేది లేదని రాష్ట్రం ఆ సంస్థకు లేఖ రాసింది. తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేసింది. అటు సంస్థ నిర్మిస్తున్న 2400MW ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయలేమని తేల్చి చెప్పింది. నిల్వలు ఉంటే సరఫరాపై పరిశీలిస్తామంది. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
News March 10, 2026
పెద్దపల్లి: ఈనెల 13న జాబ్ మేళా

పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 13న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్లో మూడు నెలల శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. డిప్లొమా, బీటెక్ అర్హత కలిగి 18–28 ఏళ్ల మధ్య ఉన్నవారు నూతన కలెక్టరేట్ భవనం, రూమ్ నం.233లో ఉదయం 11 గంటలకు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.


