News May 23, 2024

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పారామెడికల్ విద్యార్థిని మృతి చెందింది. దీంతో మృతిరాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 6, 2026

పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

image

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News March 6, 2026

ఖమ్మం: వేసవి దాహార్తి తీర్చేలా పక్కా ప్రణాళిక

image

ఖమ్మం జిల్లాలో రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో బావులు, బోర్లను పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల నీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నిరుపయోగంగా ఉన్న 863 చేతి పంపులు, 20 మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది.

News March 6, 2026

భూదాన్ భూముల పేరుతో మోసం..నలుగురి అరెస్ట్

image

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో అమాయకులను మోసగించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఓపీడీఆర్ సభ్యులమని నమ్మిస్తూ నిందితులు బల్లి శ్రీనివాస్, కోపెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు