News April 6, 2024

భద్రాద్రి జిల్లాలో యాక్సిడెంట్.. తల్లీబిడ్డలు మృతి

image

భద్రాద్రి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దమ్మపేట వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 26, 2025

ఖమ్మం జలవనరుల శాఖ సీఈగా రమేష్ బాబు

image

సూర్యాపేట సీఈ(చీప్ ఇంజనీర్)గా విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబుకు ఖమ్మం జలవనరులశాఖ సీఈగా అదనపు బాధ్యలు ఇస్తూ శనివారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31న ఖమ్మం సీఈగా ఉన్న విద్యాసాగర్ పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఖమ్మం సీఈగా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో రమేష్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

News January 25, 2025

గ్రామసభలు గొడవలు లేకుండా జరిగాయా?: తాతా మధు

image

ఖమ్మం: ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలు ఎక్కడైనా గొడవలు లేకుండా జరిగాయా అని ఖమ్మం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. వందల మంది లబ్ధిదారులకు పదుల సంఖ్యలో అర్హులను గుర్తించడమేంటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గ్రామ సభల్లో  తిరగబడిన జనం రూపంలో కనిపించిందనిన్నారు.

News January 25, 2025

KMM: జులై లోపు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి: కలెక్టర్

image

మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణ, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం భూసేకరణ పురోగతి, జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.