News November 16, 2025

భద్రాద్రి: బస్సుల్లో రద్దీ.. ప్రయాణికుల ఇబ్బందులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాలక్ష్మీ ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యాక, బస్సుల్లో అధిక రద్దీ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు RTC బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. మరిన్ని సర్వీసులు పెంచాలని జిల్లా ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

Similar News

News January 17, 2026

REWIND: 1947-77 నాగోబా జాతర దృశ్యం

image

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో 1947 నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రం వెలిసింది. ఆనాటి నుంచి మెస్రం వంశీయులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ తమ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఏటా పుష్య మాసాన్ని పురస్కరించుకొని మహాపూజను నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. ఆదివారం(రేపు) మహాపూజ జరగనుంది.

News January 17, 2026

చిత్తూరు: సచివాలయాలకు నూతన నిబంధనలు

image

సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల్లో సేవలు అందించాలని ఆదేశించింది. ఆ మేరకు ఉదయం, సాయంత్రం సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి. సమయపాలన పాటించకపోతే విధులకు హాజరుకానున్నట్లు గుర్తించనున్నారు. లీవ్ పెట్టేందుకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించింది.

News January 17, 2026

ఖమ్మం, భద్రాద్రిలో మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఇవే.!

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ ఛైర్మన్ల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ – ఎస్టీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ – జనరల్ మహిళ, అశ్వారావుపేట మున్సిపాలిటీ – జనరల్ మహిళ, ఇల్లందు – బీసీ మహిళ, కల్లూరు – ఎస్టీ జనరల్, మధిర – జనరల్ మహిళ, వైరా – జనరల్ మహిళ, సత్తుపల్లి – జనరల్ మహిళ, ఏదులాపురం – ఎస్సీ మహిళకు కేటాయించారు.