News February 10, 2025
భద్రాద్రి: 50 ఏళ్లుగా మోటారు లేకున్నా నీటి సదుపాయం

భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో వేసిన బోరులో భగీరథుడే ఉన్నట్లు నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఊరిలో నీళ్ల కరవుందని 50 ఏళ్ల కింద బోరు వేశారు.. మోటారు బిగిద్దామనుకుంటే నీళ్లు ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని అంటున్నారు. పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ నీళ్లనే వాడుకుంటున్నారు.
Similar News
News March 21, 2025
VIRAL: ప్లీజ్.. ఇది OYO కాదు.. క్యాబ్!!

బెంగళూరులో ఓ డ్రైవర్ తన క్యాబ్లో పెట్టిన పోస్టర్ వైరల్ అవుతోంది. ‘హెచ్చరిక.. రొమాన్స్కు అనుమతి లేదు. ఇది క్యాబ్, ఓయో కాదు..’ అని అతడు రాసుకొచ్చాడు. దీంతో తన క్యాబ్లో ఎన్నిసార్లు జంటల పనులతో విసిగి ఇలా చేశాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
News March 21, 2025
BREAKING: బీబీనగర్ తహశీల్దార్ సస్పెండ్

బీబీనగర్ తహశీల్దార్పై సస్పన్షన్ వేటు పడింది. పడమటిసోమారం గ్రామంలో ఖాళీ స్థలానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ జారీ చేయడంతో తహశీల్దార్ శ్రీధర్ను సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 21, 2025
శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కుమారుడు మృతి

శంకరపట్నం మండలం కేశవపట్నం బస్టాండ్ వద్ద << 15837379>>లారీ, బైకు ఢీకొన్న<<>> సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం మక్తకి చెందిన ఎస్కే అజీమ్, తన కుమారుడు రెహమాన్ శంకరపట్నం నుంచి బైకుపై ఇంటికి వెళ్తుండగా.. కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో బైక్పై వెళ్తున్న మెట్పల్లికి చెందిన మందాడి శ్రీనివాస్రెడ్డికి గాయాలయ్యాయి.