News December 1, 2025

భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

image

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.

Similar News

News February 11, 2026

బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

image

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.

News February 11, 2026

DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech, GATE, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37,000, RAకు రూ.67,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News February 11, 2026

అష్టమ శనితో వివాహం ఆలస్యం!

image

జాతకంలో ఎనిమిదో స్థానంలో శని సంచరిస్తే పెళ్లి సంబంధాలు ఆగిపోతాయని అంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో రోజూ ‘హనుమాన్ చాలీసా’ పఠించాలి. అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. నువ్వుల నూనెతో శనైశ్చరుడికి అభిషేకం చేయాలి. కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టాలి. వికలాంగులకు సాయం చేస్తే శని ప్రభావం తగ్గి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పుతో చేసే దైవ ప్రార్థన వివాహ మార్గంలోని ముళ్లను తొలగిస్తుంది.