News December 1, 2025
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.
Similar News
News February 11, 2026
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News February 11, 2026
DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 11, 2026
అష్టమ శనితో వివాహం ఆలస్యం!

జాతకంలో ఎనిమిదో స్థానంలో శని సంచరిస్తే పెళ్లి సంబంధాలు ఆగిపోతాయని అంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో రోజూ ‘హనుమాన్ చాలీసా’ పఠించాలి. అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. నువ్వుల నూనెతో శనైశ్చరుడికి అభిషేకం చేయాలి. కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టాలి. వికలాంగులకు సాయం చేస్తే శని ప్రభావం తగ్గి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పుతో చేసే దైవ ప్రార్థన వివాహ మార్గంలోని ముళ్లను తొలగిస్తుంది.


