News April 20, 2024

భానుడు ఉగ్రరూపం.. పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య

image

ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో వడగాల్పుల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వడగాల్పుల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 15 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. తాజాగా నల్గొండ మండలం చందనపల్లిలో కొండయ్య (50) వడదెబ్బతో మృతి చెందారు.

Similar News

News December 12, 2025

NLG: స్టేజ్- 2 ఆర్ఓ సస్పెండ్: కలెక్టర్

image

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్- 2 ఆర్‌వో‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

News December 12, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

నార్కట్ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్ఐ
నల్గొండ: జిల్లాలో బ్యాలెట్ పత్రాల కలకలం
నల్గొండ: సినిమా టికెట్ ధరలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నకిరేకల్: అటవీశాఖ అధికారులకు గుడ్లగూబ అప్పగింత
చండూరు: కస్తాలలో సిపిఐ బలపరిచిన అభ్యర్థి గెలుపు
కట్టంగూర్: వార్షిక వేడుకలకు నిష్కలంక మాత ఆలయం సిద్ధం
శాలిగౌరారం: 22 ఏళ్లకే ఉపసర్పంచిగా ఎన్నిక
నిడమనూరు: విధులు బహిష్కరించిన న్యాయవాదులు

News December 12, 2025

నాకు ఆ విషయం తెలియదు: మంత్రి కోమటిరెడ్డి

image

సినిమా టికెట్ల ధరల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “టికెట్ల ధర పెంచబోమని అసెంబ్లీలో చెప్పాను.. ఇకపై రేట్లు పెంచే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు. తనకు తెలియకుండానే తాజాగా జీవో విడుదలైందని, దీనిపై నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావద్దని తేల్చి చెప్పారు. సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే ధరలు తగ్గాల్సిందేనని, సామాన్యుడిపై భారం పడనివ్వబోమని మంత్రి ఉద్ఘాటించారు.