News August 14, 2025
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
Similar News
News March 16, 2026
పద్మనాభంలో భారీగా కోడిపందాలు.. 73 మంది పట్టివేత

పద్మనాభ మండలం శివారు ప్రాంతం రాయల్ గార్డెన్స్లో అర్ధరాత్రి కోడిపందాలు నిర్వహిస్తుండగా సిటీ టాస్క్ఫోర్స్ పద్మనాభం పోలీసులు పట్టుకున్నారు. కోడిపందాలు నిర్వహణ ప్రాంతంలో 73 మందిని అదుపులోకి తీసుకోగా 7,56,000 నగదు, ఎనిమిది కారులు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించడం స్థానికంగా సంచలమైంది.
News March 16, 2026
నేటి నుంచి ఒంటి పూట బడులు: డిఈవో

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 16, 2026
మూడేళ్లలో వైజాగ్ మెట్రో పూర్తి: నారాయణ

విశాఖలో వైజాగ్ మెట్రో రైలు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మెట్రో ప్రాజెక్టుపై మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని, రైటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. రెండు నెలల్లో నివేదిక వస్తుందన్నారు. ఆలస్యం లేకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. భోగాపురం కనెక్టివిటీ రోడ్లకు అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు.


