News November 16, 2025
భారీ IPOలకు సూపర్ స్పందన

ఈ ఏడాది భారీ IPOలపై మదుపర్లు ఆసక్తి కనబరిచారు. ₹5,000Crకు పైగా విలువ ఉన్న IPOలకు సగటున 17.7 రెట్ల అధిక స్పందన లభించింది. 2021 తర్వాత ఇదే అత్యధికం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 84 IPOలు ₹1.29L Cr సమీకరించగా, అందులో ఆరు సంస్థలు ₹62,000Cr దక్కించుకున్నాయి. వీటిలో LG ఎలక్ట్రానిక్స్(38.17 రెట్లు), లెన్స్కార్ట్(28.35రెట్లు), గ్రో(17.6రెట్లు), హెక్జావేర్ (2.27రెట్లు), టాటా క్యాపిటల్ (1.96రెట్లు) ఉన్నాయి.
Similar News
News January 14, 2026
మరో 9 అమృత్ భారత్ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్పాయ్గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.
News January 14, 2026
జనవరి 14: చరిత్రలో ఈరోజు

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం(ఫొటో-R)
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం(ఫొటో-L)
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
News January 14, 2026
సంక్రాంతి ప్రతిసారి ఒకే తేదీన ఎందుకు వస్తుంది?

దాదాపు మన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా వస్తుంటాయి. అందుకే క్యాలెండర్లో ఆ పండుగల తేదీలు మారుతుంటాయి. కానీ సంక్రాంతి సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు ప్రతి ఏడాది ఒకే సమయంలోమకర రాశిలోకి ప్రవేశిస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే ఈ కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే JAN 14/15 తేదీలలోనే సంక్రాంతి వస్తుంది. ఇది ఖగోళ మార్పులకు సంబంధించిన పండుగ కాబట్టి తేదీల్లో మార్పు ఉండదు.


