News April 27, 2024

‘భార్య, తమ్ముడు, కొడుకు టూ వియ్యంకుడు’

image

ఖమ్మం కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందని ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. నిన్న రాత్రి లక్ష్మీదేవిపల్లిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి తన భార్య కోసం, ఒక మంత్రి తన తమ్ముడి కోసం, మరో మంత్రి తన కొడుకు టికెట్ కోసం పోరాడారని చివరకు ఒక మంత్రి వియ్యంకుడి దగ్గర ఆగిందన్నారు. మన అభివృద్ధి మన చేతుల్లో ఉండాలా? బయటి వ్యక్తి చేతిలో పెట్టాలా? ప్రజలే ఆలోచించాలన్నారు.

Similar News

News April 12, 2026

మధిర: ఇంటర్‌ రిజల్ట్.. 1000/992 మార్కులు

image

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.

News April 12, 2026

మధిర: ఇంటర్‌ రిజల్ట్.. 1000/992 మార్కులు

image

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. ఖమ్మం 6వ స్థానం

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఖమ్మం(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14627 మంది పరీక్షలు రాయగా 11936 మంది పాసై 81.60 శాతంతో స్టేట్‌లోనే 6వ ర్యాంక్ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1928 మందికి 1429 మంది పాసై 74.12 శాతంతో 16వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1108 మందికి 411 మంది పాసై 37.09%తో 6వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 164 మందికి 79 మంది పాసై 48.17%తో 23rd ప్లేస్ వచ్చింది.