News January 19, 2026
భీమవరం వన్టౌన్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జరగనుంది. ఈ మార్పును గమనించి, అర్జీదారులు నేరుగా వన్టౌన్ స్టేషన్కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.
Similar News
News February 18, 2026
తల్లిదండ్రులకు కలెక్టర్ నాగరాణి కీలక సూచన.. ఏంటంటే?

విస్సాకోడేరు జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పౌష్టికాహారంపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే పిల్లలు పాఠశాలల్లోనే ఎందుకు భోజనం చేయాలో వారికి అర్థమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
News February 18, 2026
కలెక్టర్ గారే స్వయంగా వచ్చారు.. ఆగర్తిపాలెంలో మెగా ఈవెంట్!

పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం, లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగర్రు సొసైటీ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఆగర్రు సొసైటీ ఛైర్మన్ మేడిది జాన్ రాజు ఏర్పాట్లు పర్యవేక్షించగా, ఆర్డీఓ దాసి రాజు, ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పశుపోషకులు తమ పశువులకు వైద్యం చేయించుకున్నారు.
News February 18, 2026
నరసాపురం: పెళ్లైన విషయం దాచి బాలికతో ప్రేమ.. చివరికి..!

నరసాపురం రుస్తుంబాదకు చెందిన వివాహితుడు కొవ్వెల కళ్యాణ్, తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఓ బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్కు తరలించినట్లు DSP డా.శ్రీవేద తెలిపారు. నరసాపురం టౌన్ SI సీహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేశారు.


