News November 19, 2025
భీమవరం: వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రిక ఆవిష్కరణ

ఈనెల 19న వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా ప్రజలు, జంతువులు ఎన్నో వ్యాధులకు గురి అవుతున్నాయని తెలిపారు.
Similar News
News January 21, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.
News January 21, 2026
భీమవరం: మావుళ్లమ్మ తల్లి స్వర్ణ వస్త్ర నిధికి బంగారం అందజేత

భీమవరంలో కొలువైన శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన భరత్ కుమార్, వరలక్ష్మీ నాగప్రసన్న 8 గ్రాముల అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగర్ పాల్గొన్నారు.
News January 21, 2026
నరసాపురం స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు

నరసాపురం స్టీమర్ రోడ్డులోని మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల అరుదైన మైలురాయిని అందుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVRM) మూల్యాంకనంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా హెచ్ఎం సుధీర్ బాబు, ఉపాధ్యాయులను ఎంఈవోలు పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ అభినందించారు. పాఠశాల పారిశుద్ధ్యం, హరిత వనరుల నిర్వహణపై అధికారులు ప్రశంసలు కురిపించారు.


