News November 19, 2025
భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటు: ఎంపీ

భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఉన్న వనరులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు ఎంపీ తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Similar News
News January 12, 2026
HYD: రూ.60కే సంక్రాంతి సంబరాలు

HYD హైటెక్ సిటీ నడిబొడ్డున పల్లెటూరి పండగ సందడి మొదలైంది. మాదాపూర్ సాఫ్ట్వేర్ కుర్రాళ్ల నుంచి ఆటో అన్నల దాకా అందరినీ అలరించేందుకు శిల్పారామం సంక్రాంతి సంబరాలు (జనవరి 13-17) సిద్ధమయ్యాయి. నల్గొండ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పుట్టపాక చేనేత సిరులతో 65 ఎకరాల ప్రాంగణం అలరిస్తోంది. టికెట్ కేవలం రూ.60 మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మన ఊరి పండగను ఇక్కడే చూసేయండి!
News January 12, 2026
HYD: రూ.60కే సంక్రాంతి సంబరాలు

HYD హైటెక్ సిటీ నడిబొడ్డున పల్లెటూరి పండగ సందడి మొదలైంది. మాదాపూర్ సాఫ్ట్వేర్ కుర్రాళ్ల నుంచి ఆటో అన్నల దాకా అందరినీ అలరించేందుకు శిల్పారామం సంక్రాంతి సంబరాలు (జనవరి 13-17) సిద్ధమయ్యాయి. నల్గొండ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పుట్టపాక చేనేత సిరులతో 65 ఎకరాల ప్రాంగణం అలరిస్తోంది. టికెట్ కేవలం రూ.60 మాత్రమే. ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు మన ఊరి పండగను ఇక్కడే చూసేయండి!
News January 12, 2026
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం డబ్బులివ్వొద్దు: శ్రీధర్ బాబు

ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల పేరుతో ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని సోమవారం మంథని పర్యటనలో మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఎల్-1 లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. డబ్బులు అడిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు ఆదేశించారు. ఐదు నెలల్లో 317 మంది లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలన్నారు. అవినీతికి తావు లేదని మంత్రి తెలిపారు.


