News November 19, 2025

భూపాలపల్లి: నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా

image

భూపాలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈరోజు సింగరేణి ఇల్లందు క్లబ్‌లో రెండు పడక గదుల ఇళ్లు కేటాయింపునకు డ్రా పద్దతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొననున్నారు. లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయిస్తారు.

Similar News

News January 18, 2026

ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>EdCIL<<>> APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+రూ.4వేలు అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/

News January 18, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం.. పోటెత్తిన భక్తులు!

image

అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో చండీ హోమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. యాగశాలలో జరిగిన ఈ విశేష హోమంలో 233 మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనగా, 91 మంది పరోక్షంగా ఆన్‌లైన్ సేవ ద్వారా భాగస్వాములయ్యారు.

News January 18, 2026

HYD మెట్రో.. త్వరలో సీఎం ముందుకు ఫైనాన్స్ రిపోర్ట్..?

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.