News October 7, 2025

మంగపేటకు బస్సు ఎప్పుడు వచ్చిందో తెలుసా?

image

ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన మంగపేట గ్రామానికి 1977లో బస్సు సౌకర్యం ఏర్పాటయింది. అప్పటి MLA సంతోశ్ చక్రవర్తి ఏజెన్సీ ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించి బస్సును ఏర్పాటు చేయించారు. వరంగల్ డిపోకు చెందిన బస్సును RTC అధికారులు మంగపేటకు కేటాయించారు. ఏజెన్సీ ఏరియాకు మొదటిసారిగా బస్సు రావడంతో నాటి ప్రజలకు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

Similar News

News January 22, 2026

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

image

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సింగ్‌భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు.

News January 22, 2026

పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

image

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్‌లు సాధించిన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్‌లా మార్చే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్‌ను పవర్‌ఫుల్ రో‌ల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్‌ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్‌లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.

News January 22, 2026

ICOC చిత్తూరు ఛైర్మన్‌గా మనోజ్

image

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్‌గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.