News April 24, 2025

మంచిర్యాల: జనరల్ మజ్దూర్‌లకు శుభవార్త

image

సింగరేణి యాజమాన్యం జనరల్ మద్దూర్ కార్మికులకు శుభవార్త తెలిపింది. జనరల్ మజ్దూర్ డెసిగ్నేషన్ ‌ జనరల్ అసిస్టెంట్‌గా మార్చుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్నేళ్లుగా కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు యాజమాన్యానికి విన్నవించిన నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 6, 2026

రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

image

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

News March 6, 2026

ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం కనకదుర్గానగర్ ప్రవేశద్వారం నుంచి పవిత్ర కలశాలతో అర్చకులు, వేదపండితులు ఇంద్రకీలాద్రికి చేరుకునే కలశ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు.

News March 6, 2026

HYDలోని మరో ఆఫీస్‌కు బాంబు బెదిరింపు

image

బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. 14 బాంబులు అమర్చామని, మధ్యాహ్నం వరకు అవి పేలుతాయని ఈమెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన భవనం సురక్షితమని అధికారులు తేల్చారు. ఇటీవల వరుసగా కోర్టులకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.