News March 16, 2025
మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారి ఇచ్చిన కొడుకు

తండ్రిపై దాడి చేయించేందుకు సుఫారి ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.
Similar News
News March 5, 2026
మాక్డ్రిల్లో పాల్గొన్న సిబ్బందిని అభినందించిన కలెక్టర్, ఎస్పీ

జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భద్రతా వ్యవస్థలను పరీక్షించేందుకు మార్చి 3 నుంచి 5 వరకు ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), ఆక్టోపస్, జిల్లా పరిపాలన, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.
News March 5, 2026
NZB: కారు బోల్తా.. ఇద్దరు మృతి

నిజామాబాద్ బైపాస్ రోడ్డుపై గురువారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. మృతులను MHకు చెందిన శోభ వాగ్మారే(42), సత్వ తుకారం వాగ్మారే(45)గా గుర్తించారు. దోమకొండకు చెందిన చింతల శ్రీనివాస్, అనిత, సాహెబ్ రావు, నాగారం సాయిలు, బాలాజీ సత్వ వాగ్మరేతో పాటు డ్రైవర్ సీతారాం శ్రీరామ్కు గాయాలయ్యాయి. డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 5, 2026
బెంగాల్ గవర్నర్ రాజీనామా.. మమత ఏమన్నారంటే?

బెంగాల్ గవర్నర్ పదవికి ఆనంద్ బోస్ రాజీనామా చేయడం షాక్కు గురి చేసిందని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘ఆయన రిజైన్ వెనుక కారణం తెలియదు. కానీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి చేసి ఉంటారు. ఎన్.రవిని WB గవర్నర్గా నియమిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో నాతో చర్చించలేదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తాయి’ అని ట్వీట్ చేశారు.


