News April 27, 2024
మంత్రి విడదల రజిని నామినేషన్ తప్పులు తడక: కనపర్తి శ్రీనివాస్

మంత్రి విడదల రజిని నామినేషన్ పత్రాల్లో లెక్కలేనన్ని తప్పులు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి రజిని భర్త కుమారస్వామికి అమెరికాలో పౌరసత్వం ఉందన్నారు. మంత్రి నామినేషన్లో వార్షికాదాయం రూ. 3,96,400 ఉందన్నారు. పెదపలకలూరులో రూ.4,55,56,500 విలువ కలిగిన భూమి ఎలా కొన్నారో చెప్పాలన్నారు.
Similar News
News April 15, 2026
GNT: దొరకని రిమాండ్ ఖైదీ ఆచూకీ

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో రేపల్లె సబ్ జైలు నుంచి చికిత్స కోసం వచ్చిన ఇతడు, మూత్ర విసర్జన సాకుతో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఏలూరుకు చెందిన అజిత్పై గతంలో చీటింగ్ కేసులు ఉన్నాయి. ఎస్కార్ట్ ఉండగానే ఖైదీ చెక్కేయడం పోలీసులకు సవాల్గా మారింది.
News April 15, 2026
అంబటికి పోలీసుల నోటీసులు

కడప జిల్లా వేంపల్లి పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా వేంపల్లి స్టేషనుకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని అధికారులు ఆదేశించారు.
News April 14, 2026
GNT: ప్రతి ఏడాది ఆశాజనకంగా ఇంటర్ ఫలితాలు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో గుంటూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. 2023లో ఫస్ట్ ఇయర్లో 67%, సెకండ్ ఇయర్లో 74% ఉండగా, 2024లో అవి వరుసగా 81%, 87%కు పెరిగాయి. 2025లో ఫస్ట్ ఇయర్లో 82% నమోదు కాగా, సెకండ్ ఇయర్లో 91%కు చేరింది. విద్యార్థుల ఫలితాల్లో ఈ పెరుగుదల విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని సూచిస్తోంది. ఈ సారి ఇంకా మెరుగ్గా ఫలితాలు వస్తాయని ఆశిద్దాం.


