News April 24, 2024

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన ఆత్రం సుగుణ

image

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. వారితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు ఉన్నారు. ఇప్పటివరకు ఆమె రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.

Similar News

News January 18, 2025

నిర్మల్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడి దారుణహత్య

image

నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. చిట్యాలలో 12 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి (12) కల్లు బట్టిలో పనిచేస్తున్నాడు. కాగా గ్రామ శివారులోని చింతలచెరువు సమీపంలో రిషి మర్మంగాలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఇవాళ బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు రిషి మృతదేహన్ని గుర్తించి నిర్మల్ పోలీసులకు సమాచారం అందించారు.

News January 18, 2025

సారంగాపూర్: చిరుత పులి దాడిలో లేగదూడ మృతి

image

సారంగాపూర్ మండలంలోని ఆదివాసీ తండా, దుప్యతండాల మధ్య అటవీ క్షేత్రం సమీపంలో చిరుత దాడిలో రైతు జాదవ్ ప్రేమ్‌కుమార్ చెందిన లేగదూడ మృతి చెందినట్లు అటవీ ఉప క్షేత్ర అధికారి నజీర్ ఖాన్ తెలిపారు. రైతు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేగదూడ మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌బీఓలు సుజాత, వెన్నెల తదితరులు ఉన్నారు.

News January 18, 2025

ADB: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. APPLY NOW

image

రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధిస్ట్, పార్శి అభ్యర్థులకు గ్రూప్-1,2,3,4, RRB, SSC, బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ DMWO రాజలింగు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 లోపల మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  నాలుగు నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సు ఇస్తామని.. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.