News March 15, 2025
మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.
Similar News
News February 12, 2026
బిల్డర్లకు సాయం తప్ప రెరాలు చేసేదేమీ లేదు: CJI

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)లపై SC కీలక వ్యాఖ్యలు చేసింది. డిఫాల్టర్లయ్యే బిల్డర్లకు సాయపడడం తప్ప అవేమీ చేయడం లేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వీటిని రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. అసలు దీనిని ఎందుకు తీసుకొచ్చారో ప్రభుత్వాలు ఆలోచన చేయాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ రెరా ఆఫీసును సిమ్లా నుంచి ధర్మశాలకు తరలించడానికి సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News February 12, 2026
పార్లమెంట్లో ఏపీ అభివృద్ధిపై ‘సానా, ఉదయ్’ ప్రశ్నలు

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పార్లమెంట్ వేదికగా ఏపీ అభివృద్ధి కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరూ కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్యలపై నిత్యం గళమెత్తుతూ, వివిధ ప్రశ్నల సందిస్తున్నారు. అభివృద్ధి విషయంలో వీరిద్దరిదే పైచేయిగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉభయ సభల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరు సాగిస్తున్న పోరాటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
News February 12, 2026
నేడు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర, బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, వెంకట్రావు, రాము, కృష్ణప్రసాద్, కుమార్ రాజా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ప్రాధాన్య ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.


