News November 20, 2025
మందుబాబులకు.. ప్రకాశం పోలీస్ డిఫరెంట్ కౌన్సిలింగ్!

టంగుటూరు లోని రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతూ చెత్తాచెదారం పోగుచేసిన పలువురికి పోలీసులు భిన్న రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతుండగా ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రదేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు క్లీన్ చేశారు. మందుబాబులు అదే ప్రదేశంలో చెత్త వేయడంతో వారి చేతనే పోలీసులు క్లీన్ చేయించారు.
Similar News
News January 18, 2026
ప్రకాశం: ఫుల్గా తాగేశారు..!

ప్రకాశం జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. పండగల్లో మద్యం ప్రియులు తమ సత్తా చూపారు. 14వ తేదీ ఒక్కరోజే రూ.5.82 కోట్ల విలువైన మద్యం గౌడౌన్ నుంచి షాపులకు తరలింది. 15, 16వ తేదీల్లో గోడౌన్లకు సెలవు కావడంతో ముందుగా మద్యం షాపుల ఓనర్లు భారీగా మద్యం తీసుకు వచ్చారు. ఈనెల పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు సుమారు రూ.23 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారుల సమాచారం.
News January 18, 2026
ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.
News January 18, 2026
ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.


