News August 12, 2025
మచిలీపట్నం: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

మచిలీపట్నంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (NDD) రెండో దశ ప్రారంభమైంది. చిలకలపూడి పాండురంగ హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 99 శాతం మందికి మాత్రలు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా. ప్రేమ్ చందు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
కృష్ణమ్మ చెంత.. ఇసుకాసురుల పంజా!

విజయవాడ-అవనిగడ్డ కరకట్ట వెంబడి <<19359993>>ఇసుక దోపిడీ<<>> జోరుగా సాగుతోంది. ఒక మీటరు తవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి లోతుగా తవ్వేస్తుండగా, 20 టన్నుల సామర్థ్యం గల లారీల్లో 35 టన్నుల లోడుతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. మైనింగ్ మంత్రి నియోజకవర్గంలోనే అక్రమాలు జరుగుతున్నా విజిలెన్స్ తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News March 12, 2026
కృష్ణా: ఎంత తవ్వినా చుక్క రావట్లేదు..!

దివిసీమలో <<19359974>>అక్రమ ఇసుక తవ్వకాలు<<>> భూగర్భ జలాలను కబళిస్తున్నాయి. పులిగడ్డ నుంచి VJA వరకు నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వేయడంతో, గతంలో 10 అడుగులకే దొరికే నీరు ఇప్పుడు 100 అడుగుల లోతులోనూ లభించడం లేదు. ఫలితంగా సాగు, తాగునీటి కోసం రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాలని బాధితులుడిమాండ్ చేస్తున్నారు.
News March 12, 2026
కృష్ణా: ఒకటే బిల్లు.. ట్రిప్పులు వాళ్లిష్టం!

కృష్ణాలో<<19360004>> ఇసుక మాఫియా<<>> అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. ఒకే బిల్లుతో రోజంతా ఇష్టం వచ్చినట్లు ట్రిప్పులు వేస్తూ రూ. కోట్ల సంపదను కొల్లగొడుతున్నారు. నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఉన్నా, వాటిని ఉద్దేశపూర్వకంగా ఆపేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ లారీల రాకపోకలతో VJA-అవనిగడ్డ కరకట్ట రోడ్డు పూర్తిగా ధ్వంసమై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోటం లేదన్న విమర్శలొస్తున్నాయి.


