News March 26, 2024

మచిలీపట్నం MP టికెట్ రేసులో కొత్త పేరు

image

మచిలీపట్నం ఎంపీ టికెట్ రేసులో కొత్త పేరు వినిపిస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలశౌరికి ఈ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా, గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ నరసింహారావు పేరు కూడా పవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరిని రెండ్రోజుల్లో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు.. విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 19, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* పెనమలూరులో ఈనెల 21న జాబ్ మేళా
* మచిలీపట్నంలో రైల్వే జాబ్ స్కామ్
* కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
* విజయవాడలో డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
* బందర్‌లో బెల్ట్ దందా
* గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
* గూడూరులో కొడుకు పై పేకాట కేసు.. తండ్రి ఆత్మహత్యాయత్నం

News February 18, 2026

కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.

News February 18, 2026

క‌ష్ణా: మూగబోయిన నాడు-నేడు ప్యూరిఫైర్లు

image

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు శుద్ధ తాగునీటిని అందించేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన నాడు-నేడు పథకంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాలు జిల్లా వ్యాప్తంగా ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. గతంలో ఈ యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఐనా మరమ్మతులు చేపట్టలేదని, వేసవికి మునుపే మరమ్మతులు చేసి పిల్లలకు తాగునీరు అందించాలని పేరెంట్స్ కోరుతున్నారు.