News August 23, 2025
మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ ప్రావీణ్య

వినాయక నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని సూచించారు. పోలీసు అధికారుల సూచనలు నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 24, 2026
HYD: రేపు లుంబినీ పార్కు వద్ద సందడి!

హైదరాబాద్ గగనతలం దేశభక్తి గీతాలతో ప్రతిధ్వనించనుంది. గణతంత్ర వేడుకలు, వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టిలరీ సెంటర్ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు లుంబినీ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద భారీ ‘మిలిటరీ బ్యాండ్’ ప్రదర్శన జరగనుంది. సైనికుల క్రమశిక్షణ, సంగీత విన్యాసాల కలబోతగా సాగే ఈ వేడుక నగరవాసులకు కనువిందు చేయనుంది.
News January 24, 2026
తూ.గో: 17 మంది నేరస్తులపై PIT NDPS యాక్ట్

తూ.గోలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. దీనిలో భాగంగా గంజాయి అలవాటు పడిన 17 మంది నేరస్తులపై PIT NDPS ACT అమలుకు అనుమతులు రాగా 14 మందిని జైలుకు పంపించామన్నారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాలు, ఐసోలేషన్ ప్రదేశాలు ఇతర ప్రాంతాలలో డ్రోన్ నిఘా ఏర్పటు చేశామన్నారు.
News January 24, 2026
దుబ్బాకలో తల్లి మృతి తట్టుకోలేక కొడుకు సూసైడ్

దుబ్బాక పట్టణంలో ఎండీ అజారుద్దీన్ (28) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం తల్లి మహబూబ్ బీ చెరువులో దూకి మృతి చెందడంతో అప్పటి నుంచి అజారుద్దీన్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన అతడు గురువారం అర్ధరాత్రి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై కీర్తిరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


