News August 15, 2025

మట్టి వినాయకులను పూజిద్దాం: జేసీ

image

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జేసీ అభిషేక్ కుమార్ గురువారం వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మట్టి విగ్రహాలనే వినియోగించాలని ప్రజలకు సూచించారు. శాంతి భద్రతల కోసం బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విగ్రహాల ఎత్తు పరిమితికి మించకూడదని స్పష్టం చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను పూజించి నిమజ్జనం చేయడంతో నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు.

Similar News

News March 13, 2026

వరంగల్: టెన్త్ పరీక్షలకు గ్యాస్ కష్టాలు!

image

వారం రోజుల్లో ముగించాల్సిన పది పరీక్షలను నెల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 13 వరకు పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇరాన్ యుద్దంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మరో నెల పాటు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో సగం మంది హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.

News March 13, 2026

యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

image

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్‌ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

News March 13, 2026

ఆల్మట్టి ఎత్తు పెంపు.. కృష్ణా బేసిన్‌లో కలవరం

image

ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచే దిశగా కర్ణాటక ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కృష్ణా ఎగువ ప్రాజెక్టు మూడో విడతలో భాగంగా ఎత్తు పెంచి 130 నుంచి 250పైగా TMCల అదనపు నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. దీనికి TG, AP దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే పాలమూరు నీటి లభ్యత భారీగా తగ్గిపోనుంది. భూ సేకరణ, పునరావాసానికి కర్ణాటక ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది.