News August 25, 2024

మదనపల్లెలో విషాదం.. పాము కాటుతో మహిళ మృతి

image

పాము కాటుకు గురై ఓ మహిళా రైతు మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన మదనపల్లె మండలంలో ఆదివారం జరిగింది. ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. చీకలబైలు పంచాయతీ జమ్ముకుంటపల్లికి చెందిన బాపనపల్లి రాజశేఖర్-కవిత(33) దంపతులకు ఊరికి సమీపాన వ్యవసాయ పొలం ఉంది. కవిత రోజూ మాదిరిగానే పొలంలోకి పనికి వెళ్లగా ఆమెను పాము కాటేసింది. జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే కవిత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News January 21, 2026

24న నగరికి సీఎం రాక

image

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న ఆయన నగరికి రానున్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే భాను ప్రకాష్ హెలిప్యాడ్ స్థల పరిశీలన చేశారు. బహిరంగ సభ, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందన్నారు.

News January 21, 2026

చిత్తూరు కలెక్టర్‌కు పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.

News January 21, 2026

చిత్తూరు కలెక్టర్‌కు పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.