News April 2, 2024

మదనపల్లెలో సీఎం బహిరంగ సభ

image

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లెలో పర్యటించనున్నారు. స్థానిక టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజంపేట MP మిథున్ రెడ్డి, మదనపల్లె అసెంబ్లీ వైసీపీ MLA అభ్యర్థి నిస్సార్ అహ్మద్ లతో కలిసి పలువురు YCP నాయకులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు

Similar News

News February 12, 2026

చిత్తూరు: 17న ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి..!

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 17 నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. జిల్లాలో 1-19 ఏళ్లలోపు మొత్తం 3,62,535 మంది పిల్లలు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1-5 ఏళ్లలోపు 77,318 మంది చిన్నారులు ఉండగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 2,84,060 మందికి.. బడి బయట ఉన్న1157 మందికి మాత్రలు అందిస్తామన్నారు.

News February 12, 2026

చిత్తూరు జిల్లాలో మీకు ఈ విషయం తెలుసా?

image

కంగి, కంగడు అనే బందిపోటు దొంగలు 1066-1132 మధ్య కుప్పం ప్రాంతానికి అధిపతులుగా పాలించారు. దట్టమైన అరణ్యంలో ఎరుకలు, యానాది కులాలకు చెందిన బందిపోటు దొంగలు అక్కడక్కడ స్థావరాలను ఏర్పరచుకున్నారు. నాటి పాలకుల పేరును చిరస్థాయిగా నిలిపేలా ఈ ప్రాంతానికి కంగుంది దుర్గం అనే పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. తర్వాత జమీందారుల పాలన కొనసాగుతూ 1950 వరకు సుమారు 884 ఏళ్లు ఈ కోట రాజధానిగా ఉండేది.

News February 12, 2026

చిత్తూరు: పరీక్షల్లో అధికారుల ఫెయిల్.. 19మందిపై చర్యలు

image

రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. శాఖాపరమైన పరీక్షల్లో పాస్ కాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్-1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు శాఖపరమైన పరీక్షల్లో అనుకున్న మేర ఫలితాలు సాధించకపోవడంతో రివర్షన్ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు.