News November 19, 2025

మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

image

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.

Similar News

News January 23, 2026

మధిర: జిల్లాల రద్దు లేదు: భట్టి

image

తెలంగాణలో కొత్త జిల్లాలను ఎత్తివేస్తారంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముగింపు పలికారు. జిల్లాల రద్దు అనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సింగరేణి సంస్థ ఆస్తులను కాపాడతామని, సంస్థ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. సింగరేణి వివాదంపై రేపు పూర్తి వివరాలతో బహిరంగంగా మాట్లాడతానని ఆయన వెల్లడించారు.

News January 23, 2026

NLG: మూగజీవాల దాహార్తిని తీర్చాలి: కలెక్టర్‌

image

వేసవిలో జంతువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన SPCA సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో జంతువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆవుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పశువులకు నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు ఎండోస్కోప్‌ కిట్లను పంపిణీ చేసారు.

News January 23, 2026

పాల్వంచ: ‘మన ఇసుక వాహనం’పై కలెక్టర్ సమీక్ష

image

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రవాణా, సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, నియంత్రిత విధానంలో అమలు చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, అవినీతి వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కొత్త విధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.