News November 19, 2025
మద్యం తాగాలంటూ ఏయూ హాస్టల్లో బెదిరింపులు

దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ఏయూ పరువు రోజు రోజుకూ దిగజారుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఏయూలో నిన్న జరిగిన ఓ కార్యక్రమానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, CP శంఖబ్రత బాగ్చీ వచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ విద్యార్థి వారి వద్దకు వెళ్లి తమ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు మద్యం తాగాలంటూ బలవంతం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని VC రాజశేఖర్ తెలిపారు.
Similar News
News January 16, 2026
లీకేజీ సుడిగుండంలో HYD అగ్రీ వర్సిటీ..!

రాష్ట్రంలో ఏకైక అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరున్న రాజేంద్రనగర్ ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశ్నపత్రాల లీకేజీ సుడిగుండంలో చుట్టుకుంది. లీకేజీ కేసులో నలుగురు వర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేయగా, 35 మంది అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేశారు. 2014, 2024 మధ్య పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో అనేక అవకతవకలు జరిగినట్లు వైస్ ఛాన్స్లర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు.
News January 16, 2026
225 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 16, 2026
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,43,400 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,31,450కు చేరుకుంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూ.4,000 తగ్గి రూ.3,06,000 వద్ద కొనసాగుతోంది. కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.


