News August 11, 2025
మద్యం దుకాణంలో కరెంట్ షాక్తో వ్యక్తి మృతి

నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు పిచ్చయ్య (54) మద్యం మత్తులో స్థానిక దుకాణం రేకులను తొలగించి మద్యం సీసా తీసుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 9, 2026
రుణ లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో చేరుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో నిర్వహించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంతో పాటు ఎంఎస్ఎంఈ రంగాలకు రుణాల పంపిణీపై సమీక్షించారు. యువతకు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి ఆర్థిక చేయూత అందించాలని సూచించారు.
News March 9, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ‘మక్క’ సాగు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1.69 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. మార్కెట్లో క్వింటాల్ ధర రూ.1800 లోపే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అకాల వర్షాల నుండి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.
News March 9, 2026
కామేపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కామేపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఊట్కూరుకి చెందిన దుగ్గి సాయి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో షేక్ అఖిల్ పాషాతో పాటు మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


