News November 7, 2025
మనందరికీ చారిత్రకమైన సందర్భం: పాడేరు ఎస్పీ

వందేమాతరం గీతం 150వ ఏడాది వేడుకలు మనందరికీ చారిత్రకమైన సందర్భమని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ గీతం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేయడం మనకు గర్వకారణమైన అనుభవమన్నారు. గేయం స్ఫూర్తితో అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది కలిసి పని చేయడం చాలా ముఖ్యమన్నారు. వందేమాతరం గీతం 150వ ఏడాది వేడుకల సందర్భంగా శుక్రవారం పాడేరు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వందేమాతరం ఆలపించారు.
Similar News
News January 14, 2026
NTR: సారోళ్లు రూల్స్ చెప్తారు.. అమలు చేయరు.!

సంక్రాంతి వేళ ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ పతాక స్థాయికి చేరింది. HYD నుంచి APకి వెళ్లే బస్సు టికెట్ ధరలు రూ.6వేలు దాటడం గమనార్హం. ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామన్న రవాణా శాఖ అధికారులు.. క్షేత్రస్థాయిలో కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు.
News January 14, 2026
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కర్పూరం నూనెను వాడాలంటున్నారు నిపుణులు. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు రాసి తర్వాత రోజు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. తెల్ల జుట్టును తగ్గించడంలోనూ కర్పూరం ఉపయోగపడుతుంది.
News January 14, 2026
అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాథ చిన్నారులతో జరుపుకున్నారు. కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమాన్ని తన సతీమణితో బుధవారం సందర్శించి శిశుగృహంలో చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.


