News September 11, 2025
మనూర్: ఇంట్లోనే చదువు ఇంటికి నిలువు: సుజాత

అక్షరాస్యత ప్రాథమిక విద్యా ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైనదని మనూర్ మండలం డవ్వూరు పొదుపు సంఘం అధ్యక్షురాలు సుజాత అన్నారు. బుధవారం ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 15 ఏళ్ల పైబడిన వయోజనులందరికీ రాత్రిపూట బడి కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అక్షరాల విలువ తెలుసుకోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇంట్లోనే చదువు ఇంటికి నిలువు అనే నినాదంతో ఉల్లాస్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు.
Similar News
News December 13, 2025
అలాంటి చర్యలు చేపట్టిన వారిపై చర్యలు: ADB ఎస్పీ

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ రూరల్, బోరజ్, జైనథ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ కాకుండా గస్తీ నిర్వహించాలన్నారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
News December 13, 2025
బాపట్ల జిల్లాలో అధికంగా ఎవరు మరణించారంటే..!

రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులేనని బాపట్ల SP ఉమామహేశ్వర్ తెలిపారు. ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనన్నారు. ఇటీవల చెరుకుపల్లిలో జరిగిన ప్రమాదంలో హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలవడం వల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అనేక మంది బైక్ నడిపేవారే మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.
News December 13, 2025
TRENDING: అబిడ్స్ సండే ‘మార్కెట్’

ఆన్లైన్ పుస్తకాల హడావిడిలోనూ హైదరాబాద్ యువత ‘పాత పుస్తకాల’పైనే మోజు పెంచుకుంటోంది. డిజిటల్ విప్లవాన్ని ధిక్కరిస్తూ, ప్రతి ఆదివారం అబిడ్స్ ఫుట్పాత్లపై అరుదైన పుస్తకాలను వేటాడుతున్నారు. 60 ఏళ్ల నాటి క్లాసిక్లు, వింటేజ్ మ్యాగజైన్లు, సాహిత్యం కోసం వీరు ఇక్కడికి పోటెత్తుతున్నారు. కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యే ఈ అద్భుతమైన సంప్రదాయం నేటి యువతలో ట్రెండింగ్గా మారుతోంది. ఇక్కడ ధరలు కూడా తక్కువే.


