News November 19, 2025
మలికిపురం: బాలిక జాహ్నవి మృతదేహం లభ్యం

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన శిరిగినీడి జాహ్నవి (9) మృతదేహం బుధవారం లభ్యమైంది. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. సోమవారం ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Similar News
News January 21, 2026
మా వైఖరిలో మార్పు లేదు: బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

ICC T20WC మ్యాచ్లు భారత్లో ఆడేదే లేదని, తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరామని చెప్పారు. BCCI ఒత్తిడితో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అంగీకరించబోమన్నారు. తాము తప్పుకుంటే స్కాట్లాండ్ను చేర్చుతారన్న వార్తలను కొట్టిపారేశారు. గతంలో పాకిస్థాన్ భారత్కు రాకపోతే వేదిక మార్చారని గుర్తు చేశారు.
News January 21, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 21, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.29 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.05 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.21 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 21, 2026
చిత్తూరు కలెక్టర్కు పురస్కారం

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.


