News November 19, 2025

మలికిపురం: బాలిక జాహ్నవి మృతదేహం లభ్యం

image

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన శిరిగినీడి జాహ్నవి (9) మృతదేహం బుధవారం లభ్యమైంది. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. సోమవారం ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Similar News

News January 19, 2026

అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

image

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

News January 19, 2026

వన దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

image

మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారం జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు.

News January 19, 2026

NLG: బంకుల్లో వసూళ్లే.. వసతుల్లేవ్!

image

నల్గొండ జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు కరువయ్యాయి. డబ్బులు వసూలు చేస్తున్న యజమానులు కనీస సౌకర్యాలను విస్మరిస్తున్నారు. ఉచిత గాలి, తాగునీరు, మరుగుదొడ్లు ఉండాలన్న రూల్స్ తుంగలో తొక్కుతున్నారు. టాయిలెట్లు కంపు కొడుతున్నాయి.. లేదంటే తాళాలు వేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు కాలం చెల్లినవే. నాణ్యతను ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.