News November 19, 2025

మలికిపురం: బాలిక జాహ్నవి మృతదేహం లభ్యం

image

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన శిరిగినీడి జాహ్నవి (9) మృతదేహం బుధవారం లభ్యమైంది. తండ్రి శిరిగినీడి దుర్గాప్రసాద్, కుమారుడు మోహిత్ మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. సోమవారం ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి వారిని నదిలో తోసేసి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Similar News

News January 16, 2026

ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

image

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 16, 2026

నంద్యాల: అవును.. మీకు తెలుసా..!

image

నల్లమల అడవిలోని గిరిజన గూడాల్లో నివసించే చెంచులు శ్రీశైల భ్రమరాంబ దేవిని కూతురుగా, మల్లికార్జున స్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో మకర సంక్రాంతి రోజున పార్వతి పరమేశ్వరుల లీల కళ్యాణ మహోత్సవానికి చెంచులే అతిథులుగా నిలిచి, ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామి, అమ్మవార్లను అలంకరిస్తారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు.

News January 16, 2026

యెమెన్ ప్రధాని సలేం బిన్ బ్రేక్ రాజీనామా

image

యెమెన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి సలేం బిన్ బ్రేక్ రాజీనామా చేయగా, విదేశాంగ మంత్రి షయా మొహ్సిన్ అల్ జిందానీ కొత్త PMగా నియామకం అయ్యారు. యెమెన్ పాలక ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ యెమెన్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల మధ్య ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.