News March 26, 2024
మల్కాజిగిరిపై సీఎం SPECIAL ఫోకస్

మల్కాజిగిరి సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సిట్టింగ్ స్థానం కావడం, మరోవైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు స్థానిక నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. సునీతారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధం కావాలని సూచించారు. కాగా BRS నుంచి రాగిడి, BJP నుంచి ఈటల పోటీ చేస్తున్నారు.
Similar News
News February 13, 2026
RR: మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు.. అంతా READY..!

మున్సిపల్ ఓట్ల లెక్కించేందుకు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలై.. మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోలింగ్ బూతుల వారీగా నమోదైన ఓట్లపై అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చారు.
News February 12, 2026
RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్నగర్లో అత్యధికంగా 14, ఆమనగల్లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
News February 12, 2026
ఫ్యూచర్ సిటీ, RRR.. పల్లెల రూపు రేఖలు మారనున్నాయా.?

ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో గొప్ప నగరాన్ని నిర్మించి చూపిస్తామని రేవంత్ సర్కార్ ఢంకా బజాయించి చెబుతోంది. దీంతో పాటు కందుకూరు, యాచారం, తలకొండపల్లి, ఆమనగల్ ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానున్న విషయం విదితమే. ఈ ప్రాజెక్టుల గనుక నిర్మాణం చేపడితే ఇక్కడి పల్లెల రూపు రేఖలు నిజంగా మారే అవకాశం ఉందా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మీ కాంమెంట్.


