News August 12, 2025
మహబూబాబాద్ జిల్లాలో తగ్గిన సాగు..!

జిల్లాలో పత్తి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం తగ్గింది. అధికారులు తెలిపిన పంట ప్రణాళికలో 4,29,790 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. జిల్లాలో చెరువులు 1590 ఉండగా, కేవలం 65 అలుగు పోస్తున్నాయి. పత్తి 78,797 ఎకరాలు, వరి 1,38,576 ఎకరాలు, మొక్క జొన్న 57,264 ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడం సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News March 11, 2026
‘RC17’పై బిగ్ అప్డేట్ ఎప్పుడు?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమా గురించి బిగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27న చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా పెద్ద ప్రకటన ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ స్టోరీని రెండు వెర్షన్లుగా సిద్ధం చేశారని, చరణ్తో చర్చించి ఒక దానిని ఫైనల్ చేయాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం RC నటిస్తున్న ‘పెద్ది’ మూవీ APR 30న రిలీజ్ కానుంది.
News March 11, 2026
‘హార్ముజ్’లో నావల్ మైన్స్? ఇరాన్కు ట్రంప్ వార్నింగ్!

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్ను ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ‘ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్స్ ఏర్పాటు చేసినట్లయితే వెంటనే తొలగించాలి. లేదంటే ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో మిలిటరీ చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు. కాగా ‘హార్ముజ్’ గుండా ఆయిల్ ట్యాంకర్ను ఎస్కార్ట్ చేసినట్లు US నేవీ SMలో పోస్ట్ చేసి డిలీట్ చేయగా, ట్యాంకర్ను ఎస్కార్ట్ చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
News March 11, 2026
కరీంనగర్లో ‘ఈ-ఆఫీస్’ సేవలు ప్రారంభం

పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో ఫైళ్లను, ప్రజల ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారానే వేగంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పారదర్శక పాలన కోసమే ఈ డిజిటల్ సంస్కరణలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.


