News May 7, 2025
మహబూబాబాద్: రేపే BRS రజతోత్సవ సభ

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 10 నుంచి 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్
Similar News
News February 10, 2026
ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

T20 ప్రపంచకప్లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
News February 10, 2026
KNR: తుది దశకు చేరిన మున్సిపల్ ‘పోరు’

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సెగ క్లైమాక్స్కి చేరింది. ప్రధాన పార్టీలైనా BRS, BJP, కాంగ్రెస్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, బీజేపీ గెలిస్తేనే కేంద్రం నుంచి అధికంగా నిధులు వస్తాయని, పదేళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని బీఆర్ఎస్ను గెలిపించాలని ఆపార్టీల నేతలు చెబుతున్నారు. చివరికి ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడలి.
News February 10, 2026
HYDలో 3 కమిషనరేట్లు CONFIRM.. నంబర్లు ఇవే!

GHMCలో పాలనను పరుగులు పెట్టించేందుకు ప్రవేశపెట్టిన 3 ప్రధాన కమిషనరేట్ల ప్రతిపాదన అధికారికంగా ఖరారైంది. ఆర్వీ.కర్ణన్, టీ.వినయ్ కృష్ణారెడ్డి, జీ.సృజన నేతృత్వంలో జోన్లు, సర్కిళ్లు విడిపోయాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్ల పరిధిలోని జడ్సీలు, డిప్యూటీ కమిషనర్ల ఫోన్ నంబర్లతో కూడిన జాబితా విడుదలైంది. మహానగరం 3 ముక్కలై.. అతిపెద్ద కార్పొరేషన్గా అవతరించింది. పైన ఫొటోలో నంబర్లు ఉన్నాయి. #SAVE IT.


