News April 30, 2024

మహానంది: ఎండలకు అల్లాడుతున్న ప్రజలు

image

మహానంది మండలంలో గాజులపల్లె గ్రామంలో ఎండలకు తట్టుకోలేక పూరిళ్లలో నివసిస్తున్న వారు నీటితో ఇంటి పైకప్పుపై నీళ్లు చల్లుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉక్కపోత ఎక్కువగా ఉండటం, ఎండాకాలంలో చిన్న నిప్పురవ్వపడితే ఉండే ఇళ్లు కూడా కాలిపోతుందనే భయంతో ఇంటిపై నీళ్లు చల్లుకుంటున్నామని తెలిపారు. సూర్యతాపానికి నిలువుటద్దంగా ఈ ఫొటో నిలుస్తుందని పేర్కొంటున్నారు.

Similar News

News December 16, 2025

కర్నూలు పోలీస్ స్పందనకు 108 ఫిర్యాదులు

image

ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీలు తెలిపారు. కర్నూల్ టూ టౌన్ పక్కన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రజల వినతులను స్వీకరించారు. PGRSకు సోమవారం 108 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, గల్లంతైన వ్యక్తులు, సైబర్ నేరాలు, కుటుంబ వేధింపులు, ఆస్తి వివాదాలు వంటి పలు సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.

News December 16, 2025

కర్నూలు పోలీస్ స్పందనకు 108 ఫిర్యాదులు

image

ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పార్టీలు తెలిపారు. కర్నూల్ టూ టౌన్ పక్కన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రజల వినతులను స్వీకరించారు. PGRSకు సోమవారం 108 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు, గల్లంతైన వ్యక్తులు, సైబర్ నేరాలు, కుటుంబ వేధింపులు, ఆస్తి వివాదాలు వంటి పలు సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.

News December 15, 2025

కర్నూలు జిల్లా క్రీడాకారులను అభినందించిన నారా లోకేశ్

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న జిల్లా స్విమ్మర్స్‌ను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. డిల్లీ పర్యటనకు వచ్చిన లోకేశ్‌ను సోమవారం న్యూ ఎంపీ ఫ్లాట్‌లో క్రీడాకారులు హేమలత, శృతి, సిరి చేతన రాజ్, లహరిలు కలిశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.